News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News February 16, 2025
SVU: 24 నుంచి దూరవిద్య పరీక్షలు ప్రారంభం

శ్రీ వెంకటేశ్వర దూరవిద్య (SVU DDE) డిగ్రీ, పీజీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలు ఈనెల 3వ తేదీ నుంచి జరగాల్సింది. అనివార్య కారణాలవల్ల వాయిదా వేశారు. 24వ తేదీ నుంచి జరగనున్నట్లు నూతన షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 8వ తేదీ నుంచి ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని వారు సూచించారు.
News February 16, 2025
యలమంచిలి: 45 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

యలమంచిలి మండలంలో చించినాడ హైవే వద్ద శనివారం నరసాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లాకి మినీ లారీలో తరలిస్తున్న 45 క్వింటాళ్ల పీడీఎస్ రైసును విజిలెన్స్ సీఐ డి. ప్రసాద్ కుమార్ పట్టుకున్నారు. మినీ లారీని, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యలమంచిలి సివిల్ సప్లై డీటీ అయితం సత్యనారాయణ ఉన్నారు.
News February 16, 2025
అనంత: సేవాగడ్లో డోలు, కత్తి పట్టిన కలెక్టర్

గుత్తి మండలం చెర్లోపల్లి సేవాఘడ్లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ను శనివారం అనంత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్కు ఆలయ కమిటీ సభ్యులు డోలు, కత్తిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను లోకల్ ఫెస్టివల్గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.