News June 28, 2024

కేరళలో కవిటి మండల వాసి మృతి

image

ప్రమాదవశాత్తు కవిటి మండల యువకుడు కేరళలో మృతి చెందిన ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. జి.కరాపాడ గ్రామానికి చెందిన సురేశ్ అలియాస్ కాళీ ఉదయం తాను పని చేస్తున్న ప్రదేశం నుంచి జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సురేశ్‌కు ఇటీవల పెళ్లి నిశ్చయమైనట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News October 31, 2025

కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు: జేటీ రామారావు

image

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌస్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

News October 31, 2025

కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు: జేటీ రామారావు

image

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

News October 31, 2025

SKLM: ‘పోటీ పరీక్షలకు మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

image

మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులకు ఎస్.ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ED కె.కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఆసక్తి గల అభ్యర్థులు https://apcedmmwd.org వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.