News November 19, 2024

కేరళలో చిక్కుకున్న ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు.. స్పందించిన మంత్రి

image

శబరిమల యాత్రకు వెళ్లిన వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం చిక్కుకుంది. కేరళ పోలీసులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎలాగైనా తమకు సాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేశ్.. వారిని వెనక్కు రప్పిస్తామని చెప్పారు.

Similar News

News December 6, 2025

బాబోయ్.. మాకు తిరుపతి SVU వద్దు!

image

తిరుపతి SVU పరిధిలోని MBA, MCA కాలేజీలు వర్సిటీ నిర్ణయాలతో గగ్గోలు పెడుతున్నాయి. అధిక ఫీజులు, పరిపాలన విధానపరమైన నిర్ణయాలు సరిగా లేకపోవడం, పరీక్షా ఫలితాలు ఆలస్యం తదితర కారణాలతో SVU నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. NOC ఇస్తే అనంతపురం జేఎన్టీయూ తదితర వర్సిటీల నుంచి గుర్తింపు పొందాలని చూస్తున్నాయి. మరి SVU అధికారులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా? లేక NOCలు ఇస్తారా? వేచి చూడాలి.

News December 6, 2025

బోయకొండ గంగమ్మ భక్తులకు గమనిక

image

బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వత నిత్యార్చన సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారుల ఆదేశాలతో సంక్రాంతి నుంచి అమ్మవారికి శాశ్వత నిత్యార్చన నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదికి రూ.10,116, 6నెలలకు రూ.7,116, 3నెలలకు రూ.5,116, నెలకు రూ.2,116తో సేవా టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కుంకుమార్చన రూ.101, వడి బాల సేవ రూ.201తో నూతన సేవలు ప్రవేశ పెడతామన్నారు.

News December 6, 2025

హోంగార్డుల సంక్షేమానికి కృషి: చిత్తూరు SP

image

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కవాతు ప్రదర్శనను వీక్షించారు. చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరి సేవలు ప్రశంసనీయమన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని కొనియాడారు.