News February 6, 2025
కేశంపేట: శివస్వాములకు ముస్లిం సోదరుల అన్నదానం

HYD శివారు షాద్నగర్ సమీపంలోని కేశంపేట మండలంలోని వేములనర్వ శివాలయంలో శివ స్వాములకు ఎండీ మహమ్మద్ ఆధర్యంలో ముస్లిం సోదరులు అన్నదానం చేశారు. మతసామరస్యం చాటుకున్న సల్వార్, ఆఫీజ్, జహంగీర్బాబా, ఇమ్రాన్కు శివస్వాములు శ్రీకాంత్, గణేశ్, మహేశ్, భిక్షపతి, అశోక్, బాలరాజు, రాఘవేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
పుల్కల్: అత్తారింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య

అత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పుల్కల్ మం.లో జరిగింది. స్థానికుల వివరాలు.. పెద్దారెడ్డిపేట వాసి పట్నం ప్రవీణ్కు వట్పల్లి మం. బిజిలిపూర్కు చెందిన లక్ష్మి(26)తో 20 నెలల క్రితం వివాహమైంది. అత్తమామలు, భర్త అదనపు కట్నం తేవాలని వేధించారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టి సర్ది చెప్పినా మార్పు రాలేదు. దీంతో లక్ష్మి శనివారం ఇంట్లో ఉరి వేసుకుంది. మృతురాలికి 10 నెలల పాప ఉంది.
News November 17, 2025
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News November 17, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో పెరిగిన ‘చలి పులి’

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్, బిజినపల్లిలో అత్యల్పంగా 10.9 కనిష్ఠ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 11.2, పదరలో 11.5, ఐనోల్ 11.6, అచ్చంపేట 11.7, ఊర్కొండలో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


