News February 17, 2025

కేసముద్రం: మిర్చికి మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలి: సీపీఎం

image

మిర్చికి మద్దతు ధర క్వింటాకు రూ.25,000 ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పాపారావు అన్నారు. మిర్చిని మార్క్ ఫెడ్, నాబార్డు సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సవరించి, అన్ని వర్గాలకు సమాన వాటాలు దక్కేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 18న మండల కేంద్రాల్లో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Similar News

News December 5, 2025

ఎన్నికల నియమావళి అమలు చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రవాణా, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ప్రతి పనిని పక్కాగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

News December 5, 2025

1,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు: కలెక్టర్

image

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం ఉద్యాన శాఖపై సమీక్షించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 1,000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలని, నీటి సదుపాయం లేని చోట రుణాల ద్వారా బోర్వెల్స్ ఏర్పాటు చేసి సాగు పెంచాలని ఆదేశించారు.

News December 5, 2025

అన్నమయ్య: 8 మంది స్మగ్లర్లు అరెస్ట్

image

సానిపాయ అటవీ పరిధిలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి 12 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ కడప సబ్ కంట్రోల్ RSI నరేష్, స్థానిక FBO అంజనా స్వాతి తెలిపారు. శుక్రవారం రాయవరం సెక్షన్ చిన్నముచ్చురాళ్ల గుట్ట వద్ద తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాకు చెందిన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేశామన్నారు.