News February 26, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు 5 రోజులు సెలవులు..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు నేటి నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 శివరాత్రి, 27 మహాశివరాత్రి జాగరణ, 28 అమావాస్య, 1 వారాంతపు సెలవు, 2 ఆదివారం వారాంతపు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు గమనించాలని కోరారు.
Similar News
News February 26, 2025
మార్చి 2 వరకు జాగ్రత్త!

తెలంగాణలో 5 రోజుల పాటు ( ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2) ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రత 37డిగ్రీల నుంచి 40డిగ్రీలు చేరుకునే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్లో 34-37 డిగ్రీల మధ్య ఉండొచ్చని వెల్లడించింది. దీంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండలో బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
News February 26, 2025
విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు

సూడాన్లో జరిగిన <<15582145>>విమాన ప్రమాదంలో<<>> మరణాల సంఖ్య పెరిగింది. ఓమ్డర్మన్ నగరంలో జరిగిన ఘటనలో మరణాలు 46కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడినట్లు వెల్లడించారు. పౌర నివాసాలపై విమానం కూలడంతో మిలిటరీ సిబ్బందితో పాటు పౌరులు చనిపోయారని పేర్కొన్నారు. 2023 నుంచి సూడాన్లో ఆర్మీకి ర్యాపిడ్ దళాలకు మధ్య యుద్ధం జరుగుతోంది.
News February 26, 2025
KMR: MLC ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

MLC ఎన్నికలు సజావుగా, నిబంధనల మేరకు నిర్వహించాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ నెల 27న జరుగనున్న MDK, NZB, ADBD, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. 8 రూట్లలో 54 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.