News February 26, 2025

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 5 రోజులు సెలవులు..

image

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు నేటి నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 శివరాత్రి, 27 మహాశివరాత్రి జాగరణ, 28 అమావాస్య, 1 వారాంతపు సెలవు, 2 ఆదివారం వారాంతపు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు గమనించాలని కోరారు. 

Similar News

News October 16, 2025

సిద్దిపేటలో హృదయ విదారక ఘటన

image

సిద్దిపేట జిల్లా పుల్లూరులో హృదయ విదారక ఘటన జరిగింది. ఆయనకు ముగ్గురు పిల్లలున్నా.. ఆయన మృతదేహాన్ని ఉంచేందుకు సొంతిళ్లు లేకపోయంది. పోచయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న పోచయ్య ఆరోగ్య క్షీణించి చనిపోయారు. పొలం విషయంలో గొడవలు జరుగుతుండగా అంత్యక్రియలకు కొడుకులు ముందుకు రాలేదు. దీంతో మృతదేహాన్ని రైతు వేదికలో ఉంచి గ్రామస్థుల సహకారంతో భార్యే అంత్యక్రియలు నిర్వహించింది.

News October 16, 2025

కర్నూలుకు బయల్దేరిన ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో కర్నూలుకు బయలుదేరారు. కాసేపట్లో ఓర్వకల్లు వినానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్‌లో సుండిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

News October 16, 2025

టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే కొండేటి ప్రయత్నాలు?

image

పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు టీడీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో చేరి ఇన్ ఛార్జ్ పదవి దక్కించుకోవాలన్నదే ఆయన ప్లాన్ గా సమాచారం. టీడీపీ పెద్దలు చిట్టిబాబును పార్టీలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతుండగా.. ఆ పార్టీలోని ఎస్సీ నేతలు అడ్డుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిట్టిబాబు టీడీపీలో ఎంట్రీ జరిగేనా ? లేదా వేచి చూడాలి.