News February 26, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు 5 రోజులు సెలవులు..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు నేటి నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 శివరాత్రి, 27 మహాశివరాత్రి జాగరణ, 28 అమావాస్య, 1 వారాంతపు సెలవు, 2 ఆదివారం వారాంతపు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు గమనించాలని కోరారు.
Similar News
News December 13, 2025
దుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

దుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 65 వేలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. DEC 11న 60 వేలు, 12న 95 వేలమంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2.71లక్షల లడ్డు ప్రసాదాల పంపిణీ, 3.51 లక్షలు వాటర్ బాటల్స్, అన్నప్రసాదం 14 వేల మంది స్వీకరించారు. ఇవాళ లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
News December 13, 2025
గద్వాల్లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేస్తూ.. మరికొన్ని మంజూరు చేస్తానని కేంద్రం ప్రకటించింది. గద్వాల్ జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరైతే ఇక్కడి విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది. ఉమ్మడి జిల్లాలో వట్టెం 80 సీట్లు, MBNR 40 సీట్లు ఉన్నాయి. ఈ దిశగా MP, MLAలు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. నవోదయ ప్రవేశ పరీక్షతో విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశాలు ఉంటాయి. దీనిపై మీ కామెంట్..!
News December 13, 2025
తిరుపతి: SVకాలేజీలో అన్యమత ప్రచారం.. ప్రిన్సిపల్ ఏమన్నారంటే.!

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో <<18550600>>అన్యమత ప్రచారం<<>>పై Way2Newsలో వచ్చిన కథనంపై ప్రిన్సిపల్ వై.ద్వారకానాథ్ రెడ్డి స్పందించారు. సంబంధిత లెక్చరర్ నుంచి వివరణ తీసుకున్నామన్న ఆయన.. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బందికి ఆదేశాలు ఇస్తామన్నారు.


