News February 26, 2025

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 5 రోజులు సెలవులు..

image

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు నేటి నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 శివరాత్రి, 27 మహాశివరాత్రి జాగరణ, 28 అమావాస్య, 1 వారాంతపు సెలవు, 2 ఆదివారం వారాంతపు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు గమనించాలని కోరారు. 

Similar News

News November 21, 2025

‘అరటి సాగుచేస్తున్న రైతులను ఆదుకోండి’

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి సాగుచేస్తున్న రైతులను వెంటనే ఆదుకోవాలని CPM నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నల్లప్ప, తదితర నాయకులు అరటి పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక అరటి సాగుచేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

News November 21, 2025

TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు.

News November 21, 2025

ADB: రైతులందరికీ జోగురామన్న కృతజ్ఞతలు

image

ఆదిలాబాద్ జిల్లా రైతులందరికీ మాజీ మంత్రి జోగు రామన్న కృతజ్ఞతలు తెలిపారు. ఆఖిలపక్ష రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేస్తూ రైతులందరికీ న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడటానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.