News April 9, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ఉత్పత్తుల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. ✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2489. కనిష్ఠం: 1859. ✓ పత్తి: గరిష్ఠం: 7289. కనిష్ఠం: 5611. ✓ మక్కలు: గరిష్ఠం: 2236. కనిష్ఠం: 1850. ✓ తేజా మిర్చి: గరిష్ఠం: 12,600. కనిష్ఠం: 8002. ✓ తేజా తాలు: గరిష్ఠం: 5811. కనిష్ఠం: 5502. ✓ కందులు: గరిష్ఠం: 6689. కనిష్ఠం: 6069.✓ పేసర్లు: గరిష్ఠం: 7239. కనిష్ఠం: 6089.
Similar News
News November 18, 2025
సెరామిక్ పాత్రలతో ప్రయోజనం..

ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఫుడ్డే కాదు వాడే పాత్రలూ ముఖ్యమే. అల్యూమినియం, ఇత్తడి, నాన్ స్టిక్ వల్ల అనారోగ్యం వస్తుందంటున్నారు నిపుణులు. వీటిబదులు సెరామిక్ వాడటం మంచిది. దీంట్లో రసాయనాల కోటింగులు ఉండవు. పుల్లటి పదార్థాలు వండినా రుచి, పరిమళాల్లో మార్పు రాదు. సిలికాన్తో రూపొందిన సెరామిక్ జెల్ నాన్స్టిక్గా పనిచేస్తుంది. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలోనూ సురక్షితంగా ఉంటాయి. శుభ్రపరచడం కూడా చాలా సులువు.
News November 18, 2025
భార్య మృతి కేసులో టీచర్ సస్పెన్షన్: అనకాపల్లి డీఈవో

భార్య మృతి కేసులో బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారం ఎంపీయూపీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరావును డీఈవో అప్పారావునాయుడు మంగళవారం సస్పెండ్ చేశారు. ఉమామహేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యుల వేధింపులు కారణంగా భార్య వీణ చోడవరంలో నివాసం ఉంటున్న ఇంటిలో ఈనెల 12న కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటనపై పోలీసులు ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు.
News November 18, 2025
మద్యం తాగుతున్నారా.. డాక్టర్ ఏమన్నారంటే?

అతిగా మద్యం సేవిస్తే చిన్న వయసులోనే తీవ్రమైన మెదడు రక్తస్రావం వచ్చే ప్రమాదం ఉందని US అధ్యయనంలో వెల్లడైనట్లు ప్రముఖ వైద్యుడు సుధీర్ హెచ్చరించారు. భారీగా మద్యం సేవించేవారిలో ప్లేట్లెట్స్ పనిచేయక రక్తం గడ్డకట్టే సామర్థ్యం దెబ్బతింటుందని వెల్లడించారు. ఫలితంగా పెద్ద రక్తస్రావాలు సంభవిస్తాయని తెలిపారు. మద్యం తాగితే ఏకాగ్రత, నిర్ణయాధికారం దెబ్బతింటాయని, అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు.


