News February 9, 2025
కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు: సీతక్క

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడన్నారు. రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు.
Similar News
News October 21, 2025
ఖమ్మంలో పోలీసు అమరవీరులకు ఘన నివాళి

శాంతి సమాజ స్థాపన కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. అమరవీరుల స్మారక స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొని వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
News October 21, 2025
పేదల సంక్షేమం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి(M) ధర్మతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల వలే నడిపిస్తున్నామని చెప్పారు. పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు.
News October 21, 2025
ఆసుపత్రికి చెవిరెడ్డి తరలింపు

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కేసులో రిమాండ్ పడటంతో విజయవాడ జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పంటి సమస్య ఇబ్బంది పెట్టడంతో విజయవాడలోని గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్కు చెవిరెడ్డిని తరలించారు. చికిత్స అనంతరం జైలుకు తీసుకెళ్లనున్నారు.