News February 9, 2025
కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు: సీతక్క

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడన్నారు. రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు.
Similar News
News February 14, 2026
నిఘా నీడలో వేములవాడ మహాశివరాత్రి జాతర

వేములవాడ మహాశివరాత్రి జాతర సందర్భంగా పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. శ్రీ భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం పరిసరాలతో పాటు పట్టణంలో వివిధ ప్రాంతాలలో 175 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్, క్యూ లైన్లు, యాత్రికులు సంచరించే ప్రాంతాలను నిత్యం గమనిస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గితే శనివారం నాడు సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ పరిశీలించారు.
News February 14, 2026
మంథని పట్టణంలో పట్టు కోల్పోయిన బీఆర్ఎస్

మంథని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. మొత్తం 13 వార్డుల్లో అభ్యర్థులను పోటీ చెయ్యగా కాంగ్రెస్ ధాటికి తలొగ్గి కేవలం ఒకేఒక్క స్థానాలకి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 11వార్డుల్లో విజయకేతనం ఎగురవేశారు. ప్రధాన వార్డుల్లో ఓటమి చవిచూడడంతో కారు పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
News February 14, 2026
మిర్యాలగూడలో 11 మందికి ‘0’ ఓట్లు

MLG మున్సిపాలిటీ ఎన్నికల్లో వింత ఘటన చోటుచేసుకుంది. పోటీ చేసిన 51 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో ఏకంగా 11 మందికి ‘సున్నా’ ఓట్లు వచ్చాయి. వీరికి కనీసం ఒక్కరి నుంచి కూడా మద్దతు లభించకపోవడం చర్చనీయాంశమైంది. మరో ఐదుగురు అభ్యర్థులు కేవలం ఒక్క ఓటుతోనే సరిపెట్టుకున్నారు. ఈ ఫలితాలు చూసి పట్టణ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఓ వార్డుకు చెందిన వారు మరో వార్డులో పోటీలో ఉన్నట్లు సమాచారం.


