News October 11, 2024
కేసీఆర్ 5వేల స్కూళ్లను మూసేశారు: సీఎం

TG: పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ విద్యపై దృష్టి పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతో దాదాపు 5వేల స్కూళ్లను మూసేశారని ఆరోపించారు. పేదలు చదువుకుంటే బానిసలుగా ఉండరనేది కేసీఆర్ ఆలోచన అని మండిపడ్డారు. తాము విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని సీఎం వివరించారు.
Similar News
News November 25, 2025
వనపర్తి జిల్లా ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

వనపర్తి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి.
మొదటి విడత: ఘణపురం, పెద్దమందడి, రేవల్లి, గోపాల్పేట, ఏదుల మండలాలు.
రెండో విడత: ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, మదనాపూర్, వనపర్తి మండలాలు.
మూడో విడత: చిన్నంబావి, పానగల్, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
News November 25, 2025
వనపర్తి జిల్లా ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

వనపర్తి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి.
మొదటి విడత: ఘణపురం, పెద్దమందడి, రేవల్లి, గోపాల్పేట, ఏదుల మండలాలు.
రెండో విడత: ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, మదనాపూర్, వనపర్తి మండలాలు.
మూడో విడత: చిన్నంబావి, పానగల్, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
News November 25, 2025
మున్సిపల్ వాటర్తో బెంజ్ కారు కడిగాడు.. చివరకు!

TG: చాలా మంది వాటర్ బోర్డ్ సరఫరా చేసే తాగునీటితోనే యథేచ్ఛగా వాహనాలను కడిగేస్తుంటారు. HYD బంజారాహిల్స్ రోడ్ నం.12లో అలా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా నీటితో కారు కడగడాన్ని గమనించారు. వెంటనే అతడికి ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరవాసులను హెచ్చరించారు.


