News April 1, 2025

కేసీ వేణుగోపాల్‌ను కలిసిన ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేలు

image

ఢిల్లీలో ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేలంతా కలిసినట్లు సమాచారం. కలిసిన వారిలో ఎమ్మెల్యేలు టీ. రాంమోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య ఉన్నారు.

Similar News

News October 28, 2025

NZB: అయ్యో.. రూ. 3 లక్షలు పోయాయ్..!

image

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి. డబ్బులు పోయిన బాధతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుంటే డ్రాలో పేరు రాలేదని నైరాశ్యంలో మునిగారు.

News October 28, 2025

కురుమూర్తి స్వామికి హనుమద్వాహన సేవ

image

కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు సోమవారం రాత్రి స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆలయం నుంచి కళ్యాణకట్ట, దేవరగుట్ట మీదుగా పూలమఠం వరకు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, ఈవో పాల్గొన్నారు.

News October 28, 2025

మొంథా: వాల్తేరు డివిజన్‌లో హెల్ప్‌డెస్క్ నంబర్లు ఇవే

image

మొంథా తుపాను నేపథ్యంలో వాల్తేర్ డివిజన్లోని పలు రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్ నంబర్లను ఏర్పాటు చేశారు.
➤ విశాఖ: 0891-2746330, 0891-2744619,
➤ దువ్వాడ: 0891-2883456
➤ అరకు: 08936-249832
➤ విజయనగరం: 08922-221202
➤ బొబ్బిలి: 0891-2883323, 0891-2883325
➤ శ్రీకాకుళం: 08942-286213, 08942-286245
➤ నౌపడ: 0891-2885937
➤ రాయగడ: 0891-2885744, 0891-2885755
➤ కొరాపుట్: 0891-2884318, 0891-2884319