News August 27, 2024

కేసులకు భయపడం: కాకాణి

image

టీడీపీ ప్రభుత్వం పెట్టే కేసులకు తాము భయపడేది లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని దళిత బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారు. ఆయన చెప్పిన వివరాలను నేను ఫార్వర్డ్ చేసినందుకు నాపై కేసు పెట్టారు. A2గా నన్ను చేర్చారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’ అని కాకాణి అన్నారు.

Similar News

News October 14, 2025

“బర్త్ రేట్ “లో నెల్లూరు ఎక్కడంటే?

image

రాష్ట్ర వ్యాప్తంగా birth rate ను పరిశీలిస్తే జిల్లాలో 1000 మంది బాలురుకు 1011 మంది బాలికలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. లింగ వివక్షకు సంబంధించి చట్టాలు కఠినంగా ఉండడంతో కొంతమేరా వీటికి అడ్డుకట్ట పడినట్లు తెలుస్తోంది. అయితే ఏదొక మూల వైద్య శాఖ కళ్లు గప్పి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయానేది సమాచారం.

News October 14, 2025

జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా సుజాత బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారినిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ సంబంధిత శాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న పరిమళ బదిలీ కావడంతో కొద్ది కాలంగా ఈ పోస్ట్ భర్తీ కాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న సుజాతకు ప్రమోషన్ లభించడంతో అధికారులు ఆమెను నెల్లూరుకు బదిలీ చేశారు.

News October 14, 2025

తగ్గిన డిమాండ్.. పతనమవుతున్న ధరలు

image

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు తగ్గుముఖం పట్టినట్లు వ్యాపారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణం అంటున్నారు. సాధారణంగా దీపావళికి డిమాండ్ ఉంటుందని, ఈ దఫా అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం ధర కిలో రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుందన్నారు. రానున్న కాలంలో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.