News May 1, 2024
కేసులు పెడితే భయపడేది లేదు: రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం తనపై కేసులు పెడితే భయపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోరుట్ల పట్టణ శివారులో జరిగిన జన జాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన వెనుక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చిన, రిజర్వేషన్లు రద్దు చేసిన ఊరుకునేది లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
Similar News
News January 8, 2026
కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.
News January 8, 2026
కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.
News January 8, 2026
KNR: ‘బీసీ సబ్ప్లాన్ నిధులను విడుదల చేయాలి’

బీసీ సబ్ప్లాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ అధ్యక్షలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు గంగిపెళ్లి అరుణ, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా ఉన్నారు.


