News March 25, 2025
కేసుల పరిష్కారానికి కృషి చేస్తా: APP

కామారెడ్డి కేసుల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, జిల్లా కోర్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవుని సూర్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, పట్టణ ఎనిమిదవ వార్డు పార్టీ ఇంచార్జి గంప ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
Similar News
News October 29, 2025
ఈ మార్గాల్లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచనున్న రైల్వే

గుంటూరు-పగిడిపల్లి, మోటమర్రి(ఖమ్మం)-విష్ణుపురం(నల్గొండ) సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే ఆమోదం తెలిపింది. రూ.188 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో దీనిని పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మార్గాలు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సరకు, ప్యాసింజర్ రైళ్ల సేవలను మరింత వేగవంతం చేయనున్నాయి.
News October 29, 2025
ఓదెల మండలంలో అధిక వర్షపాతం

పెద్దపల్లి జిల్లాలో మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలో అత్యధికంగా 70.5మి.మీ. వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. అధికారులు లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పాలకుర్తి, రామగుండం, అంతర్గాం మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయింది.
News October 29, 2025
భరత్ పోరాటం వృథా.. ఓడిన తెలుగు టైటాన్స్

PKL సీజన్-12లో పుణేరి పల్టాన్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో తెలుగు టైటాన్స్ 45-50 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫస్టాఫ్లో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచినా సెకండాఫ్లో పుణేరి పుంజుకుంది. భరత్ 23 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా TT డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఓటమితో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణే ఫైనల్ చేరింది. ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.


