News March 25, 2025
కేసుల పరిష్కారానికి కృషి చేస్తా: APP

కామారెడ్డి కేసుల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, జిల్లా కోర్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవుని సూర్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, పట్టణ ఎనిమిదవ వార్డు పార్టీ ఇంచార్జి గంప ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
Similar News
News November 24, 2025
పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గురించి మీకు తెలుసా..?

పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జిల్లాలో అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేయడానికి 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంస్థ 7281.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 21,36,660 జనాభాను కలిగి ఉంది. పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ పరిధిలో 28 మండలాల్లోని 349 గ్రామాలు, 8 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా చిరుమామిళ్ల మధుబాబును ప్రభుత్వం ఇటీవల నియమించింది.
News November 24, 2025
పెవిలియన్కు క్యూ కట్టిన భారత ప్లేయర్లు

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో భారత ప్లేయర్ల ఆటతీరు మారడం లేదు. నిలకడ లేమితో వికెట్లు పారేసుకుంటున్నారు. తాజాగా 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో IND 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ ఒక్కడే 58 రన్స్తో కాస్త రాణించారు. రాహుల్(22), సుదర్శన్(15), నితీశ్(10), పంత్(7), జడేజా(6), జురెల్(0) పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి టెస్టులో బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్కోర్ 136/7.
News November 24, 2025
పదేళ్లలో BRS ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదు: సీతక్క

పదేళ్లలో BRS ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి సీతక్క విమర్శించారు. సోమవారం BHPL జిల్లా గోరి కొత్తపల్లిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సంఘంలో సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ₹10 లక్షలు అందిస్తున్నామని అన్నారు. అలాగే, సంఘంలో లోన్ తీసుకున్న మహిళ చనిపోతే వారి లోన్ మాఫీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇలా మరణించిన 64 మందికి లోన్ మాఫీ జరిగిందని ఆమె తెలిపారు.


