News March 4, 2025
కైకలూరు: కూలి పనులకు వెళ్లి పాముకాటుకు గురైన యువకుడు

కూలి పనికి వెళ్లిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ జాన్ పదో తరగతి పూర్తి చేశాడు. గుంటూరు(D) అమరావతిలో చేపల పట్టుబడికి ఆదివారం సాయంత్రం 11 మంది గ్రామస్థులతోపాటు మత్స్యకార కూలీగా అతనూ వెళ్లాడు. వీరంతా అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకోవడంతో పాకలో నిద్రపోయారు. నిద్రలో ఉన్న జాన్ను విషసర్పం కాటు వేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News November 28, 2025
వనపర్తి: చిన్న నీటి వనరుల గణనకు శిక్షణ

వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో చిన్న తరహా నీటి వనరుల గణన కోసం ఎన్యూమరేటర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ హరికృష్ణ, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, అదనపు కలెక్టర్ శ్రావ్య పాల్గొని సూచనలు చేశారు. కేంద్ర జల వనరుల శాఖ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ ఎన్యూమరేషన్ను జాగ్రత్తగా పూర్తి చేయాలని వారు కోరారు. ఈ శిక్షణకు ఏఈవోలు, జీపీవోలు, ఎఫ్ఏలు, టీఏలు హాజరయ్యారు.
News November 28, 2025
స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.
News November 28, 2025
కడప జిల్లా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.


