News March 4, 2025

కైకలూరు: కూలి పనులకు వెళ్లి పాముకాటుకు గురైన యువకుడు

image

కూలి పనికి వెళ్లిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ జాన్ పదో తరగతి పూర్తి చేశాడు. గుంటూరు(D) అమరావతిలో చేపల పట్టుబడికి ఆదివారం సాయంత్రం 11 మంది గ్రామస్థులతోపాటు మత్స్యకార కూలీగా అతనూ వెళ్లాడు. వీరంతా అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకోవడంతో పాకలో నిద్రపోయారు. నిద్రలో ఉన్న జాన్‌ను విషసర్పం కాటు వేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News January 13, 2026

‘యువత’ జైలు పాలు

image

TG: మత్తు పదార్థాలు వినియోగం, పొక్సో కేసులు, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. 2025లో పలు కేసుల్లో 42,566 మంది జైలుకు వెళ్లగా వారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వారేనని జైళ్ల శాఖ నివేదిక పేర్కొంది. 2024తో పోలిస్తే ఇది ఏకంగా 13% అధికమని తెలిపింది. 40,090 మంది తొలిసారి నేరం చేసి జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడించింది. గత ఏడాది 3,634 ఖైదీలు విడుదలైనట్లు పేర్కొంది.

News January 13, 2026

వరంగల్ మార్కెట్‌కి 5 రోజుల సుదీర్ఘ సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 5 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 14న (బుధవారం) భోగి, 15న (గురువారం) సంక్రాంతి, శుక్రవారం కనుమ, శనివారం, ఆదివారం వారాంతపు సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి ఐదు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News January 13, 2026

వరంగల్ మార్కెట్‌కి 5 రోజుల సుదీర్ఘ సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 5 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 14న (బుధవారం) భోగి, 15న (గురువారం) సంక్రాంతి, శుక్రవారం కనుమ, శనివారం, ఆదివారం వారాంతపు సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి ఐదు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.