News April 14, 2025
కైకలూరు: బిలాస్ పూర్ ఎక్స్ప్రెస్కి తృటిలో తప్పిన ప్రమాదం

కైకలూరు స్టేషన్ నుంచి వెళుతున్న తిరుపతి- బిలాస్ పూర్ ఎక్స్ప్రెస్కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల ఏసీ కోచ్ మీద పెద్ద చెట్టు విరిగిపడింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ట్రైన్ సిబ్బంది చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
Similar News
News November 20, 2025
కుక్క కాటు వల్ల చనిపోతే రూ.5 లక్షల పరిహారం

కుక్క కాటు వల్ల ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.5 వేలు ఇస్తామని, ఇందులో రూ.3,500 బాధితులకు, రూ.1,500 ట్రీట్మెంట్ కోసం అందజేస్తామని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య కర్ణాటక స్కీమ్ కింద పాము కాటు బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది.
News November 20, 2025
KMR: NPYAD పథకం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ దరఖాస్తులకు ఆహ్వానం

2025-26 సం.రానికి గాను జాతీయ యువత, కౌమార దశ అభివృద్ధి కార్యక్రమం NPYAD పథకం కింద ఆర్థిక సహాయమందించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 30 లోపు ఎటువంటి లాభాపేక్ష లేని స్వచ్ఛంధ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముందుగా http://NGO darpan.gov.inలో నమోదు చేసుకొని యూనిక్ దర్పన్ ఐడి పొందాలన్నారు. వివరాలకు కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.
News November 20, 2025
ఎన్టీఆర్: సీఆర్డిఏలో 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, స్ట్రాటజీ & కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని CRDA కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలకు పైన ఇచ్చిన వెబ్సైట్ చూడాలన్నారు.


