News February 1, 2025
కైకలూరు : సాంకేతిక కారణాలతో ప్రారంభం కాని పెన్షన్ల పంపిణీ

కైకలూరు మండల పరిధిలో సాంకేతిక కారణాల వల్ల పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఐదున్నర గంటలకి సచివాలయ ఉద్యోగులు వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో పెన్షన్ యాప్ పనిచేయడం లేదని అంటున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను నివేదించినట్లు సమాచారం.
Similar News
News January 6, 2026
కడప జిల్లాలో ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల సాయం.!

కడప జిల్లాలో 7298 మంది ఉల్లి రైతులకు 14,203.31 ఎకరాలకు రూ.28.40 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
*కమలాపురం 2526 మందికి రూ.11.32 కోట్లు
*మైదుకూరు 2352 మందికి రూ.7.74 కోట్లు
*పులివెందుల 1590 మందికి రూ.6.17 కోట్లు
*జమ్మలమడుగు 742 మందికి రూ.2.99 కోట్లు
*బద్వేల్ 67మందికి రూ.14.92 లక్షలు
*రాజంపేట 18మందికి రూ.2.33 లక్షలు
*కడప ఇద్దరికి రూ.35,900
*ప్రొద్దుటూరులో ఒకరికి రూ.20.60 వేలు.
News January 6, 2026
KNR: సర్పంచులకు చెక్ పవర్..

సర్పంచుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పంచాయతీల్లో నిధుల వినియోగానికి సర్పంచులకు చెక్ పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 22న కొలువుదీరిన పాలకవర్గాలకు ఇది ఊరటనిచ్చే అంశం. రాష్ట్ర నిధులు నేరుగా డ్రా చేసుకునే వీలుండగా, కేంద్ర నిధులకు అవసరమైన ‘డిజిటల్ కీ’ బాధ్యతలపై స్పష్టత రావాల్సి ఉందని కరీంనగర్ డీపీఓ జగదీశ్వర్ తెలిపారు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడనుందన్నారు.
News January 6, 2026
తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు.. కేసు నమోదు

తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు వెలుగు చూసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 1/2026 నంబర్తో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. యాదృచ్ఛికంగా పడేశారా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బాటిళ్లు వేసి వైరల్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.


