News March 7, 2025
కైలాసగిరిలో అదుపులోకి వచ్చిన మంటలు: ప్రణవ్ గోపాల్

కైలాసగిరిపై రోప్ వే సిబ్బంది వ్యర్థాలను తగలబెట్టడం వల్లే మంటలు వ్యాపించాయని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ (ఎంసీ) కేఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. తక్షణమే మంటలను అదుపు చేయాలని వీఎంఆర్డీఏ అటవీ విభాగం అధికారులను ఆదేశించామన్నారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించామని, మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు.
Similar News
News March 26, 2025
గాజువాకలో యువకుడి సూసైడ్

గాజువాక మండలం B.C రోడ్డులోని వాంబేకాలనీలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్గా పనిచేస్తున్న పవన్(21) ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులే కారణంగా చనిపోతున్నట్లు మృతుడు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 26, 2025
మేయర్ పీఠం.. విశాఖ అభివృద్ధికి శాపం కానుందా?

విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు GVMC బడ్జెట్పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025-26కి సంబంధించి బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో YCP కార్పొరేటర్లను బెంగుళూరు తరలించారు. మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లూ YCPకి చెందిన వారే కావడంతో వారి హాజరుపై అనుమానం నెలకొంది. దీంతో సమావేశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
News March 26, 2025
విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక.. అంశాలివే..!

➤ 98 ఎకరాల్లో 5 సోలార్ ప్లాంట్లు, 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
➤ ట్రాఫిక్ నియంత్రణకు 72.82 కి.మీ. పొడవున 15 రహదారులు జూన్ నాటికి పూర్తి
➤ జీవీఎంసీ పరిధిలో ఐదు చోట్ల వర్కింగ్ విమెన్ హాస్టల్స్
➤ పరదేశిపాలెంలో రూ.70లక్షలతో కాలేజీ అమ్మాయిలకు హాస్టల్ భవనం నిర్మాణం
➤ రూ.కోటితో కేజీహెచ్ ఓపీ, క్యాజువాలటీ ఆధునీకరణ
➤ విశాఖ పోర్టులో క్రూయిజ్ టూరిజం ప్రారంభం
➤ బీచ్లో హోప్ ఆన్, హోప్ ఆఫ్ బస్సు సర్వీసులు