News April 13, 2025

కైలాసపట్నంలో మృతి చెందిన వారి వివరాలు ఇవే

image

అనకాపల్లి జిల్లా కైలాసపట్నం మందు గుండు తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన వారిలో అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవిందు(45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల(38),పురం పాప(40),గుంపిన వేణుబాబు(40),సేనాపతి బాబురావు(56), మనోహర్ ఉన్నారు. మరికొద్ది సేపటిలో హోం మంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి రానున్నారు.

Similar News

News February 23, 2026

నిర్మల్: ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

image

సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రక్త కళ్యాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News February 23, 2026

MLC కర్రి పద్మశ్రీకి మండలి ఛైర్మన్ నోటీసులు!

image

ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ YCP నుంచి TDPలో చేరిన సంగతి తెలిసిందే. కాగా ఎమ్మెల్సీ పదవికి ఆమె చేసిన రాజీనామా ఆమోదం పొందకపోవడంతో, ఈ నెల 27న హాజరై వివరణ ఇవ్వాలని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. మరోవైపు, ఆమె రాజీనామా ఆమోదమైతే ఆ పదవిని తిరిగి ఆమెకే ఇస్తారా అన్న అంశంపై కాకినాడ జిల్లా TDPలో చర్చ జరుగుతోంది.

News February 23, 2026

పచ్చిపాలతో మెరిసే చర్మం

image

* పచ్చి పాలు, తేనె కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్‌తో శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * పచ్చి పాలలో అరటి పండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. దీని కోసం కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.