News April 13, 2025
కైలాసపట్నం ఘటన.. కేజీహెచ్కు క్షతగాత్రుల తరలింపు

కైలాసపట్నం మందు గుండు సామగ్రి తయారీ కేంద్రం వద్ద పేలుడు జరిగిన స్థలంలో మరో రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతి చెందిన వారిలో ఒకరిని రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మిగా గుర్తించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఇద్దరిని విశాఖ కేజీహెచ్కు తరలిస్తున్నారు. పేలుడు ఎలా జరిగిందో స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. మందు గుండు తయారీ కేంద్రం యజమాని రమేశ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


