News April 13, 2025
కైలాసపట్నం ఘటన.. కేజీహెచ్కు క్షతగాత్రుల తరలింపు

కైలాసపట్నం మందు గుండు సామగ్రి తయారీ కేంద్రం వద్ద పేలుడు జరిగిన స్థలంలో మరో రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతి చెందిన వారిలో ఒకరిని రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మిగా గుర్తించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఇద్దరిని విశాఖ కేజీహెచ్కు తరలిస్తున్నారు. పేలుడు ఎలా జరిగిందో స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. మందు గుండు తయారీ కేంద్రం యజమాని రమేశ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
Similar News
News December 3, 2025
VKB: పల్లెల్లో జోరుగా ఎన్నికల దావత్లు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని గ్రామాలు కళకళలాడుతున్నాయి. ఈసారి గతంలో కంటే భిన్నంగా ప్రచార పర్వం ప్రారంభమైంది. తెల్లవారుజామునే ప్రచారాలు మొదలు పెట్టి, చీకటి పడగానే దావత్లు జోరుగా సాగుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో చుక్క- ముక్కతో వివిధ వర్గాల వారీగా విందులు ఇస్తున్నారు. ఎన్నికల దావత్లు కొత్త వ్యాపారులకుకిక్ ఇస్తున్నాయి.
News December 3, 2025
జనాభా పెంచేలా చైనా ట్రిక్.. కండోమ్స్పై ట్యాక్స్!

జననాల రేటు తగ్గుతుండటంతో చైనా వినూత్న నిర్ణయం తీసుకుంది. కొత్తగా కండోమ్ ట్యాక్స్ విధించనుంది. జనవరి నుంచి కండోమ్ సహా గర్భనిరోధక మందులు, పరికరాలపై 13% VAT విధించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు పిల్లల సంరక్షణ, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్ తొలగిస్తోంది. కాగా 1993 నుంచి కండోమ్స్పై అక్కడ వ్యాట్ లేదు.
News December 3, 2025
వంజరపల్లిలో సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ!

సంగెం మండలం వంజరపల్లిలో ఎస్టీ జనాభా లేకపోవడంతో సర్పంచ్, 1,4,6 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఎస్టీ జనాభా లేని గ్రామానికి ఈ పదవులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లింది. నామినేషన్ గడువు ముగిసే సమయానికి 5 వార్డులకు మాత్రమే నామినేషన్లు రావడంతో, ఉప సర్పంచ్గానే గ్రామ పాలన నడిచే పరిస్థితి.


