News January 10, 2025

కొండంత జనం

image

తిరుమలలో శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వీఐపీలతో పాటూ సాధారణ భక్తులు తిరుమల వేంకన్నను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. నారాయణుడి నామస్మరణతో తిరుమల ప్రాంగణం మార్మోగింది. స్వామి వారి స్వర్ణ రథోత్సవం సందర్భంగా తీసిన ఫొటోలు అబ్బుర పరుస్తున్నాయి.

Similar News

News October 3, 2025

చిత్తూరు ఎస్పీ ఆధ్వర్యంలో ఆయుధపూజ

image

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ఏఆర్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఆయుధపూజ నిర్వహించారు. ఆయుధ కారాగారం, పోలీసు క్యాంటీన్, జిమ్, పోలీసు అసోసియేషన్ ఆఫీస్, అడ్మిన్ కార్యాలయాలలోనూ పూజలు చేశారు. ప్రజల రక్షణకై పోలీసు సిబ్బంది తుపాకులను క్రమశిక్షణతో వాడుతుందని ఎస్పీ తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించడానికి విజయదశమి ప్రతీక అన్నారు.

News October 2, 2025

తమిళ పోలీసులను సర్వీస్ నుంచి తొలగింపు

image

చిత్తూరు జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ తిరువన్నామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ సుందర్, సురేశ్ రాజ్‌లను పోలీస్ సర్వీస్ నుంచి తొలగిస్తూ ఎస్పీ సుధాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్‌ను ఇప్పటికే అరెస్టు చేసి వేలూరు జైలులో రిమాండ్‌కు తరలించారు. ఇనపద్దంలో ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగిస్తూ SP ఉత్తర్వులు జారీ చేశారు.

News October 2, 2025

చిత్తూరు జిల్లాకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర అవార్డ్స్

image

చిత్తూరు జిల్లాకు స్వర్ణాంధ్ర-2025 అవార్డులు దక్కాయి. రాష్ట్రస్థాయిలో ఆరు అవార్డులు, జిల్లా స్థాయిలో 48 అవార్డులు దక్కాయి. ఈనెల ఆరో తేదీన మంత్రి మండిపల్లి అవార్డుల ప్రదానం చేయనున్నారు పరిశుభ్రత రంగంలో విశిష్ట సేవలకు ఈ అవార్డులు దక్కాయి. ఈ మేరకు వివరాలను కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈ విజయాలు స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన వెల్లడించారు.