News January 10, 2025

కొండంత జనం

image

తిరుమలలో శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వీఐపీలతో పాటూ సాధారణ భక్తులు తిరుమల వేంకన్నను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. నారాయణుడి నామస్మరణతో తిరుమల ప్రాంగణం మార్మోగింది. స్వామి వారి స్వర్ణ రథోత్సవం సందర్భంగా తీసిన ఫొటోలు అబ్బుర పరుస్తున్నాయి.

Similar News

News October 5, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

వెదురుకుప్పం మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక వివరాల మేరకు.. పచ్చికాపల్లం-తిరుపతి హైవేపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 5, 2025

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు PGRS

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News October 5, 2025

ప్రమాదంలో కృష్ణాపురం రిజర్వాయర్..?

image

జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం రిజర్వాయర్ ప్రమాదకరంగా మారింది. ప్రధాన గేట్లు మూడు చోట్ల లీకేజీలు ఉండడంతో నీరు వృథాగా పోతోంది. ప్రధాన గేటుకు అవసరమైన జనరేటర్ కూడా పాడైంది. ఐదేళ్లుగా గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. ఐదేళ్ల క్రితం నిర్మించిన రాక్ కాంక్రీట్ దెబ్బతింది. రిజర్వాయర్‌కు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు.