News October 14, 2024
కొండగట్టుకు వాహన పూజలతో రూ.3,37,900 ఆదాయం
మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రోత్సవాల (దసరా) సందర్భంగా గతేడాది వాహన పూజల ద్వారా 3 రోజులకు రూ.2,67,600 ఆదాయం వచ్చిందని ఆలయ కార్య నిర్వహణాధికారి తెలిపారు. ఈ ఏడాది మూడు రోజులకు రూ.3,37,900ల ఆదాయం సమకూరిందని, ఈ సంవత్సరం వాహన పూజల ద్వారా రూ.70,300లు అదనంగా సమకూరిందని తెలిపారు.
Similar News
News October 14, 2024
రాయికల్ మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో నేడు ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో బతుకమ్మను కొలిచి ఆడి పాడి నేడు మహిళలు, యువతులు తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతరం వాటిని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి వాగులు, చెరువులలో నిమజ్జనం చేశారు.
News October 14, 2024
కరీంనగర్: ముమ్మరంగా రేషన్ కార్డుల సవరణ!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు రేషన్ కార్డులలో లోపాలను సవరిస్తున్నారు. అనర్హులను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరణించినవారు, వివాహమై అత్తింటికి వెళ్లిన మహిళలు తదితరులను తొలగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత 9 నెలల వ్యవధిలోనే 1,186 రేషన్ కార్డులను రద్దు చేసి 5,819 మంది లబ్ధిదారుల పేర్లు తొలగించారు.
News October 14, 2024
తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి: KNR కలెక్టర్
ప్రతినిత్యం తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, తద్వారా చేతుల అపరిశుభ్రత వల్ల వచ్చే అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సూచించారు. అక్టోబర్ 15న ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘బ్యానర్’ను ఆమె ఆవిష్కరించారు. ‘ఆరోగ్య భద్రత’ అంశాన్ని విస్తృత ప్రచారం చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.