News February 28, 2025

కొండగట్టులో పలు వ్యాపారాలకు టెండర్

image

జిల్లాలోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవాళ పలు వ్యాపారాలకు అధికారులు ఈ, సిల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు అమ్ముకునే హక్కుకు రూ. 1,50,00,000, పుట్నాలు, పేలాలు అమ్ముకునే హక్కుకు రూ. 27,70,000, పూలు, పండ్లు అమ్ముకునే హక్కుకు రూ.40,00,000, గాజులు ప్లాస్టిక్ ఆట వస్తువులు అమ్ముకునే హక్కు రూ.32,00,000 లతో హెచ్చు పాటాదారులు దక్కించుకున్నారు.

Similar News

News March 1, 2025

నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 15,692 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 550 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST

News March 1, 2025

కేజ్రీవాల్ రావణుడు, ఆతిశీ శూర్పణఖ: BJP MLA

image

కేజ్రీవాల్, ఆతిశీని ఢిల్లీ BJP MLA గజేంద్ర యాదవ్ రావణుడు, శూర్పణఖతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు హతమవుతారు. కానీ శూర్పణఖ బతికిపోతుంది. ఇక్కడ కూడా ఓటమితో కేజ్రీవాల్, సిసోడియా రాజకీయ భవిష్యత్తు ముగిసింది. కానీ ఆతిశీ గెలిచారు. అందుకే ఆమె శూర్పణఖ లాంటివారు’ అని ఎద్దేవా చేశారు. ఇక తాము చేసే మంచిని చూసి ఆప్ నేతలెప్పుడూ ఏడుస్తూనే ఉంటారని ఆయన విమర్శించారు.

News March 1, 2025

NZB: ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు

image

మార్చ్‌ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని NZB DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 17,789 మంది, రెండో సంవత్సరంలో 18,433 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందు కోసం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

error: Content is protected !!