News September 28, 2024
కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
Similar News
News December 24, 2025
కరీంనగర్: పత్తి రైతులకు విజ్ఞప్తి

జిల్లా పత్తి రైతులకు సీసీఐ వారు కాపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసి పత్తిని అమ్ముకొనే క్వింటాళ్ల నిబంధనలో మార్పు చేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి తెలిపారు. ఈ నెల 25 అర్థరాత్రి నుంచి స్లాట్ బుకింగ్ చేసుకొన్న రైతులు గరిష్టంగా అదనంగా 5 క్వింటాళ్ళ పత్తిని విక్రయించడానికి అనుమతి ఇవ్వడమైనది. రైతులు పత్తి పరిమాణాన్ని నమోదు చేసుకొని పత్తి కొనుగోళ్ళకు సహకరించాలని కోరారు.
News December 24, 2025
సీపీఐ శతవసంతాల ముగింపు సభను విజయవంతం చేయండి: చాడ

భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల ఉత్సవాలలో బాగంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. గడిచిన వందేళ్లలో పేదల పక్షాన నిలబడి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.
News December 24, 2025
KNR: దక్షిణాది స్థాయి ఈత పోటీలకు స్వరణ్, భువన్ ఎంపిక

హైదరాబాద్లో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగే దక్షిణాది రాష్ట్రాల ఈత పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కంకణాల స్వరణ్, భువన్ ఎంపికయ్యారు. ఇటీవల ఆదిలాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వరణ్ బ్యాక్స్ట్రోక్ విభాగంలో రజత పతకం సాధించగా.. వాటర్ పోలో జట్టుకు భువన్ ఎంపికయ్యారు. వీరిని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, కోచ్లు అభినందించారు.


