News April 13, 2025
కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత కట్టుదిట్టంగా ఉండేలా అధికారులకు సూచనలు ఇచ్చారు. శాంతి, నిబద్ధతతో ఉత్సవాలు నిర్వహించాలని స్థానికులు కోరారు.
Similar News
News December 9, 2025
గద్వాల: రూ.50 వేలకు మించితే పత్రాలు తప్పనిసరి: ఎస్పీ

గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రూ.50 వేలకు మించి నగదు తరలించేవారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. లేనిపక్షంలో ఆ నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 11న ఎన్నికలు జరిగే గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో ఫలితాలు ప్రకటించే వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (BNSS) యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్: టెక్నాలజీ గుప్పిట్లో ‘ప్రగతి’ లక్ష్యాలు!

TG గ్లోబల్ సమ్మిట్లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) సంచలనం సృష్టించాయి. ఫ్యూచరిస్టిక్ డోమ్లో ఈ 17 లక్ష్యాలను అద్భుతంగా ప్రదర్శించడం రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అద్దం పట్టింది. వృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో సాగాలనే స్పష్టమైన సందేశాన్నిస్తూ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని ముడిపెట్టే ఈ ప్రదర్శన సమ్మిట్కు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్: టెక్నాలజీ గుప్పిట్లో ‘ప్రగతి’ లక్ష్యాలు!

TG గ్లోబల్ సమ్మిట్లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) సంచలనం సృష్టించాయి. ఫ్యూచరిస్టిక్ డోమ్లో ఈ 17 లక్ష్యాలను అద్భుతంగా ప్రదర్శించడం రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అద్దం పట్టింది. వృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో సాగాలనే స్పష్టమైన సందేశాన్నిస్తూ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని ముడిపెట్టే ఈ ప్రదర్శన సమ్మిట్కు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.


