News April 13, 2025
కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత కట్టుదిట్టంగా ఉండేలా అధికారులకు సూచనలు ఇచ్చారు. శాంతి, నిబద్ధతతో ఉత్సవాలు నిర్వహించాలని స్థానికులు కోరారు.
Similar News
News April 20, 2026
పరమాత్ముడు ఒక్కటే.. మతాలన్నీ ప్రజల కల్పనలే!

మర్మమెరుగ లేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: పరమాత్ముడి అసలు రహస్యం తెలియక మూఢ జనాలు విభిన్న మతాలను కల్పించారు. ఒకరినొకరు ద్వేషించుకుంటూ బాధపడుతూ కాలం గడుపుతున్నారు. అద్దాల గదిలో ఉన్న కుక్క తన ప్రతిబింబాన్ని చూస్తే కలవరపడి మొరుగుతుందో అలా చేస్తున్నారు.
<<-se>>#PADHYAM<<>>
News April 20, 2026
డిగ్రీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఫ్రీ హాస్టల్, కోచింగ్

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ BC గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 కాలేజీల్లో BSc, BCom, BBA లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు యానిమేషన్ వంటి స్పెషల్ కోర్సుల్లో 9,260 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు మే 10వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉచిత వసతితోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.
News April 20, 2026
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ పరీక్షలు.. 7757 విద్యార్థులు

జిల్లాలో ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ 10 ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. పదో తరగతికి 10 పరీక్ష కేంద్రాల్లో 2,692, ఇంటర్మీడియట్కు 18 కేంద్రాల్లో 5,065, మొత్తం 7,757 మంచి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.


