News June 29, 2024

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జనసేనాని

image

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ 12PMకు కొండగట్టు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా కొండగట్టు వచ్చిన పవన్ కళ్యాణ్.. అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. రెండు రాష్ట్రాల నుంచి పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో కొండగట్టు చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టారు.

Similar News

News December 17, 2025

తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్‌లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.

News December 17, 2025

తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్‌లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.

News December 16, 2025

తూ.గో: TDP జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు వెంకట రమణ చౌదరి?

image

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజానగరం నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి, ప్రస్తుత ‘రుడా’ అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఏడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని ఆయనకు అధిష్ఠానం కేటాయించింది. రాజానగరం స్థానం జనసేనకు కేటాయించడంతో, రమణ చౌదరి ఈ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. వెంకట రమణ చౌదరి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.