News February 1, 2025

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని ఈరోజు రాష్ట్ర డీజీపీ జితేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్, సీఐ నీలం రవి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Similar News

News December 11, 2025

అల్లూరి జిల్లాలో వింత..!

image

అల్లూరి జిల్లా ఎం.భీమవరం పంచాయతీ కొత్తూరులో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నాగేశ్వరావు అనే రైతు సాగు చేస్తున్న మొక్కజొన్నకు 16 పొత్తులు వచ్చి అబ్బురపరుస్తున్నాయి. ఈ మొక్కను చుట్టు పక్కల వారు వింతగా చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇన్ని పొత్తులు చూడలేదని.. రెండు లేదా మూడు మాత్రమే వచ్చేవని చెప్పారు. విత్తనంలో జన్యు పరమైన లోపంతో ఇలా వస్తాయని హార్టికల్చర్ అధికారులు అంటున్నారు.

News December 11, 2025

ట్రంప్ గోల్డ్ కార్డ్.. US పౌరసత్వానికి రాజమార్గం

image

US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘<<18527355>>గోల్డ్ కార్డ్<<>>’ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ స్కీమ్‌ ద్వారా అత్యంత వేగంగా ఆ దేశ పౌరసత్వం పొందచ్చు. భారీగా డబ్బులు ఇచ్చే వ్యక్తులు, కంపెనీలకు లీగల్ స్టేటస్‌, పౌరసత్వం ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా అప్లై చేస్తే $1M, కంపెనీలు స్పాన్సర్‌ చేస్తే $2M చెల్లించాలి. దీంతో పాటు DHS ఫీజు $15,000 కట్టాలి. అదే గ్రీన్ కార్డు కావాలంటే ఏళ్లపాటు నిరీక్షణ, కఠిన నిబంధనలు ఉంటాయి.

News December 11, 2025

ఆయుర్వేద స్నానం గురించి తెలుసా?

image

చాలామంది పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తుంటారు. కానీ శరీరానికి కలిగిన శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో కొన్ని పదార్థాలు కలిపి చేస్తే హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, మల్లెలు, గులాబీ రేకలు వేసుకుని చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు, నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే శరీరం తేలిగ్గా అవుతుంది.