News April 2, 2025

కొండగట్టు : అంజన్న సన్నిధిలో దీక్షలు స్వీకరణ

image

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేడు పలు జిల్లాలకు చెందిన భక్తులు హనుమాన్ మాల స్వీకరించారు . స్థానిక ఆలయ అర్చకులు పవన్, అనిల్, శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో 11 రోజులు పాటు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ రోజు మాల వేసుకున్న స్వాములు చిన్న జయంతికి విరమణ చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం దీక్ష స్వాములు అంజన్నను దర్శించుకున్నారు .

Similar News

News October 15, 2025

జూబ్లీ బైపోల్: క్రిటికల్ లొకేషన్.. పోలీసులకు టెన్షన్ 

image

జూబ్లీహిల్స్ బైఎలెక్షన్ పోలీసులకు కాస్త టెన్షన్‌గా మారింది. నియోజకవర్గంలో 139 లొకేషన్లలో 407 పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 139 ప్రాంతాల్లో 57 ప్రాంతాలను క్రిటికల్ లొకేషన్లుగా పోలీసులు గుర్తించారు. బోరబండ PS పరిధిలో 27, మధురానగర్ లిమిట్స్‌లో 18, జూబ్లీహిల్స్‌లో1, పంజాగుట్టలో 5, టోలిచౌకి 2, గోల్కొండ 2, సనత్‌నర్లో 2 ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు.

News October 15, 2025

నిర్మల్: మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. 2025-26 సంవత్సరానికి 5 పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.గతంలో ప్రవేశ పరీక్ష రాసి, సీటు రాని వారు ఒరిజినల్ హాల్ టికెట్, కుల, ఆదాయ, విద్యా ధృవీకరణ పత్రాలతో 17న జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 మధ్యలో హాజరు కావాలి.

News October 15, 2025

జూబ్లీ బైపోల్: పట్టున్నా.. పోరులో లేదాయే..!

image

జూబ్లీహిల్స్‌ బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లుండగా వీరిలో 96వేల మంది మైనారిటీ ఓటర్లున్నారు. ఈ ఓట్లన్నీ ఎటువైపు పడితే ఆ అభ్యర్థి విజయం సాధిస్తాడనడంలో డౌట్ లేదు. అందుకే ఈ ఓట్ల కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. MIMకు పట్టు ఉన్నా పోటీచేయకపోవడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అంతర్గతంగా కాంగ్రెస్‌కి ఆ పార్టీ మద్దతిస్తున్నట్లు సమాచారం.