News April 2, 2025
కొండగట్టు : అంజన్న సన్నిధిలో దీక్షలు స్వీకరణ

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేడు పలు జిల్లాలకు చెందిన భక్తులు హనుమాన్ మాల స్వీకరించారు . స్థానిక ఆలయ అర్చకులు పవన్, అనిల్, శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో 11 రోజులు పాటు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ రోజు మాల వేసుకున్న స్వాములు చిన్న జయంతికి విరమణ చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం దీక్ష స్వాములు అంజన్నను దర్శించుకున్నారు .
Similar News
News November 20, 2025
సిద్దిపేట: ‘నా చిట్టి చేతులు’ ఇటుక బట్టీల పాలు!

బడికి వెళ్లి హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో పిల్లల భవిష్యత్ బూడిద పాలవుతుంది. ఈ దయనీయ పరిస్థితి అక్బర్ పేట భూంపల్లిలోని ఇటుక బట్టీలో కనిపించింది. ప్రభుత్వాలు 18 ఏళ్లు నిండని పిల్లలతో పనులు చేయించవద్దని చెప్తున్న కాంట్రాక్టర్లు, గుత్తేదారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వారు తమకు నచ్చినట్లుగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇటుక బట్టీల వ్యాపారం కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
News November 20, 2025
AP న్యూస్ రౌండప్

*రైతుల నుంచి ప్రతి ధాన్యం బస్తా కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*బిహార్ CM నితీశ్ కుమార్కు YS జగన్ శుభాకాంక్షలు
*గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలకృష్ణకు సత్కారం
*డిసెంబర్ 15 నుంచి అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో సరిహద్దుల్లేని ప్లాట్లకు కొత్త పెగ్ మార్క్లు వేసే ప్రక్రియ ప్రారంభం
*2026లో రిటైర్ కానున్న ఐదుగురు IAS అధికారులను నోటిఫై చేసిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
News November 20, 2025
హాస్టల్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జేసీ

జిల్లాలోని ఎస్సీ, బీసీ, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వసతి గృహాల అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని జేసీ టి.నిశాంతి సూచించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్ వద్ద రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా పాఠశాలలకు మంజూరు చేయబడిన 1,000 బకెట్లు, 1,000 దుప్పట్లను ఆమె అధికారులకు అందజేశారు. విద్యార్థులకు పాఠశాలల్లో, హాస్టళ్లలో సౌకర్యవంతమైన వసతులు కల్పించాలని జేసీ సూచించారు.


