News March 19, 2025

కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డి

image

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమలై అంజి రెడ్డి  కుటుంబ సమేతంగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోచ్చరణతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏసిఎస్ రాజు, భావన ఋషి, మేన మహేశ్ బాబు, బండారి మల్లికార్జున్, మల్యాల మండల సీనియర్ నేత ప్రసాద్, బిట్టు పాల్గొన్నారు.

Similar News

News December 18, 2025

ఖమ్మం: 99 సర్పంచి స్థానాల్లో ఎర్రజెండా రెపరెపలు

image

కమ్యూనిస్టుల కోటగా పేరుగాంచిన ఉమ్మడి ఖమ్మంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎర్రజెండా మరోసారి తన సత్తా చాటింది. జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు 99 స్థానాలను కైవసం చేసుకుని తమ పట్టు నిరూపించుకున్నాయి. ఇందులో CPI 56, CPM 37, CPI (ML) న్యూడెమోక్రసీ 6 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశాయి. కొన్నిచోట్ల అధికార కాంగ్రెస్, మరికొన్ని చోట్ల BRSతో సాగించిన అవగాహన వామపక్ష అభ్యర్థుల విజయానికి బాటలు వేసింది.

News December 18, 2025

పుస్తకాల పండుగ రేపటి నుంచే

image

TG: హైదరాబాద్‌లో రేపటి నుంచి నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు బుక్ ఫెయిర్ ఓపెన్‌లో ఉంటుంది. గతేడాది 10 లక్షల మంది వచ్చారని, ఈ ఏడాది 12-15 లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి దివంగత కవి అందెశ్రీ పేరు పెట్టారు.

News December 18, 2025

హన్మకొండ జిల్లాలో ఓట్ల శాతం ఎంతంటే?

image

HNL జిల్లాలో 2019 జనవరిలో జీపీ ఎన్నికలు 7 మండలాల్లోని 130 జీపీలకు జరగగా, ఒంటిమామిడిపల్లి మినహా 129 జీపీలకు 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 2 ఎన్నికలను పోల్చితే 2019లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. అప్పట్లో ఐనవోలు మండలంలో 90% పోలింగ్ నమోదైంది. ఫేజ్ వారీగా 2019లో తొలి దశ 89.02%, 2వ దశ 86.83%, 3వ దశ 88.80% పోలింగ్ పోలింగ్ కాగా, 2025లో తొలి దశ 83.95%, 2వ దశ 87.34%, 3వ దశలో 86.44% పోలింగ్ అయింది.