News January 25, 2025

కొండగట్టు అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ప్రసాద్

image

కొండగట్టు అదనపు ఈవోగా కృష్ణ ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 18న ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంతరావు సెలవులో ఉండడం వలన, హైదరాబాద్ దేవాదాయశాఖలో డీసీఎస్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్రసాద్‌కు కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నూతన ఈవోకు ఆలయ అధికారులు అర్చకులు శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈనెల 30న హుండీ లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు ఈవో తెలిపారు.

Similar News

News November 28, 2025

మంచాన్ని గోడలకు ఆనించవచ్చా?

image

మంచాన్ని గోడకు ఓవైపు మాత్రమే ఆనించి ఉంచాలని, అదే శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. మిగిలిన 3 వైపులా వీలైనంత ఖాళీ స్థలం ఉండాలంటున్నారు. ‘మంచంపై నుంచి వ్యక్తులు సులభంగా దిగడానికి, ఎక్కడానికి అనుకూలంగా ఉండాలి. గదిలో ఇరుకు ఉండకుండా, ఏ ఇబ్బంది లేకుండా నడిచేలా స్పేస్ ఉండాలి. దీనివల్ల శక్తి ప్రవాహం పెరుగుతుంది. 3 వైపులా గోడలు ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 28, 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్రముఖులు

image

ఉజ్వల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, యుఏఈ రాజ కుటుంబ సభ్యుడు షేక్ తారిక్ అల్ ఖాసిమీ, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్‌తో పాటు ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు హాజరుకానున్నారు.

News November 28, 2025

గుంటూరులో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మొత్తం 15 వినతులు స్వీకరించి, వ్యక్తిగత, సర్వీసు, బదిలీ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం పోలీస్ శాఖకు ప్రాధాన్యం అని, భయపడకుండా సమస్యలను నేరుగా తెలియజేయాలని ఆయన సూచించారు.