News January 25, 2025

కొండగట్టు అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ప్రసాద్

image

కొండగట్టు అదనపు ఈవోగా కృష్ణ ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 18న ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంతరావు సెలవులో ఉండడం వలన, హైదరాబాద్ దేవాదాయశాఖలో డీసీఎస్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్రసాద్‌కు కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నూతన ఈవోకు ఆలయ అధికారులు అర్చకులు శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈనెల 30న హుండీ లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు ఈవో తెలిపారు.

Similar News

News November 24, 2025

నిజామాబాద్: స్థానిక పోరుకు సిద్ధమా..!

image

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని 31 మండలాల్లోని 545 GPలు, 5022 వార్డులు, 5053 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 4,54,621 మంది, పురుషులు 3,96,778 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.

News November 24, 2025

ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన వివరాలు ఇవే

image

ఏలూరు జిల్లాలో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను జిల్లా అధికారులు తెలిపారు. 11:30 నిమిషాలకు కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకుని పొంగుటూరు-లక్కవరం రోడ్డు పనులను పరిశీలిస్తారు. 12 గంటలకు ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు మ్యాజిక్ ట్రైన్ పరిశీలిస్తారని వెల్లడించారు.

News November 24, 2025

ఖమ్మం జిల్లాలో లక్ష నుంచి 30వేల ఎకరాలకు

image

ఖమ్మం జిల్లాలో మూడేళ్లుగా మిర్చిసాగు క్రమంగా తగ్గుతోంది. ధర, దిగుమతి లేకపోవడంతో రైతులు విముఖత చూపుతున్నారు.2020లో జిల్లాలో 1,08లక్షల ఎకరాలు మిర్చి సాగు చేశారు. 2023లో 92,274, 2024లో 59.205, ఈ ఏడాది 31,741ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 3ఏళ్ల క్రితం క్వింటా రూ. 25వేలు పలికింది. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ ప్రస్తుతం రూ. 15వేల లోపే ఉంది. చైనాలో మిర్చిసాగు పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.