News January 25, 2025
కొండగట్టు అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ప్రసాద్

కొండగట్టు అదనపు ఈవోగా కృష్ణ ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 18న ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంతరావు సెలవులో ఉండడం వలన, హైదరాబాద్ దేవాదాయశాఖలో డీసీఎస్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్రసాద్కు కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నూతన ఈవోకు ఆలయ అధికారులు అర్చకులు శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈనెల 30న హుండీ లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు ఈవో తెలిపారు.
Similar News
News October 15, 2025
20 మంది మృతి.. పరిహారం ప్రకటించిన ప్రధాని

రాజస్థాన్లో జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు వెళ్తున్న బస్సు <<18008110>>దగ్ధమై<<>> 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
News October 15, 2025
సూర్యాపేట: రాయితీ సొమ్ము కోసం ఎదురుచూపులు..!

సూర్యాపేట జిల్లాలో లబ్ధిదారులకు అకౌంట్లలో రాయితీ జమ కావడం లేదు. ఐదారు నెలలుగా రాయి సొమ్ము రావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 4 లక్షలకు పైనే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మహాలక్ష్మీ పథకం కోసం దాదాపు 3 లక్షలకు పైనే దరఖాస్తులు అందాయి. రాయితీ డబ్బులు పడితే తమకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని, ప్రభుత్వం స్పందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
News October 15, 2025
బీమా పొందాలంటే ఈ- పంట, ఈ- కేవైసీ తప్పనిసరి: కలెక్టర్

తుఫాను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు బీమా, పరిహారం పొందాలంటే ఈ- పంట, ఈ- కేవైసీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం చేశారు. కలెక్టర్ మంగళవారం మాట్లాడారు. గ్రామ స్థాయిలోని వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించి ఈ పంట ఈ కేవైసీపై అవగాహన కల్పించి పూర్తి చేయాలన్నారు. అటు 1.85 లక్షల ఎకరాలలో వరి సాగు ఉందని పేర్కొన్నారు.