News December 27, 2024
కొండవీడు కోట చరిత్ర మీకు తెలుసా?

పల్నాడు జిల్లా యడ్లపాడు(M) కొండవీడు గ్రామ పరిధిలో ప్రఖ్యాతి చెందిన కొండవీడు కోట ఉంది. ఇది గుంటూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెడ్డిరాజులు 1325 నుంచి 1425 వరకు ఈ కోటను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోటలో 21 నిర్మాణాలు ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకూ శిథిలావస్థలో ఉన్నాయి. కానీ నేటికీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోందని ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులు తెలిపారు.
Similar News
News November 15, 2025
అమరావతిలో ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ స్టేడియం

రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్తో AIFF ఛైర్మన్ కళ్యాణ్ చౌబే భేటీ అయ్యారు. అమరావతిలో 12 ఎకరాల్లో AIFF ఫుట్బాల్ స్టేడియం నిర్మాణం ప్రారంభించనున్నట్టు చౌబే వెల్లడించారు. గ్రాస్రూట్స్ ఫుట్బాల్ కోసం పీఈటీలకు శిక్షణ, కోచ్ల గ్రేడింగ్లో APతో భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు.
ఏపీలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డీఎస్సీలో 3% రిజర్వేషన్ ఇచ్చామని లోకేశ్ ఆయనకు తెలిపారు.
News November 15, 2025
వీధుల పాలైన బాల్యం.. కూటి కోసం భుజాలపై చెత్త భారం.!

పుస్తకాల సంచితో బడికి వెళ్లాల్సిన బాల్యం నేడు వీధుల పాలైంది. గుంటూరు నగర వీధుల్లో శనివారం కనిపించిన దృశ్యం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. ఎండను సైతం లెక్కచేయకుండా, పసి వయసులోనే కొందరు చిన్నారులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్నారు. బాలల హక్కుల గురించి ఎన్ని చట్టాలు ఉన్నా, పట్టపగలే నగరంలో ఇలాంటి బాలకార్మిక దృశ్యాలు కనిపించడం ఆవేదన కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
News November 15, 2025
GNT: నేడు ఘట్టమనేని శివరామకృష్ణ వర్ధంతి

గుంటూరు (D) బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న, ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు.1965 తేనె మనసులు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. తేనె మనసులు హిట్ అవడంతో, అప్పటి అగ్ర హీరోలతో పోటీపడి సూపర్ స్టార్గా ఎదిగారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఇలా ఎన్నో హిట్ సినిమాలతో 350పై చిలుకు సినిమాలు చేసి అగ్ర హీరోల సరసన నిలిచారు. 15 నవంబర్ 2022న తుది శ్వాస విడిచారు.


