News May 21, 2024

కొండాపురం: బంగారు పథకానికి ఎంపికైన శ్రావణి

image

మండలంలోని రేణమాల గ్రామానికి చెందిన కండే శ్రావణి కామర్స్ లో స్వర్ణ పథకానికి ఎంపికయ్యారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటర్ పూర్తయ్యాక ఈమె కొన్నేళ్లపాటు చదువును నిలిపివేశారు. అనంతరం చదువుపై మక్కువతో వింజమూరులోని డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు, ప్రథమ స్థానంలో నిలిచారు. వివాహమయ్యాక భర్త ప్రోత్సాహంతో పీజీ చదువుకున్నారు. నేడు గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పథకం అందుకోనున్నారు.

Similar News

News January 11, 2026

నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఖైదీ పరార్

image

నెల్లూరు సెంటర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పరారయ్యాడు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ చిన్న సైదులు 2022 సంవత్సరంలో తన భార్యను హత్య చేసి శిక్షను అనుభవిస్తున్నాడు. రెండు సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్షణ అనుభవించి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ సైదులు సత్ప్రవర్తన కింద ఓపెన్ జైలుకు తరలించారు. వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు.

News January 11, 2026

నెల్లూరు: త్వరలో మూడు చోట్ల ఇసుక రీచ్‌లు.?

image

పెన్నా పరీవాహక ప్రాంతంలో మరో 3 చోట్ల కొత్త ఇసుక రీచ్‌లు రానున్నాయట. ఇప్పటికే పొట్టేపాలెం, సంగం, సూరాయాపాలెం వద్ద పాయింట్లు ఉండగా విరువూరు వద్ద ఓపెన్ రీచ్ ఉంది. వీటితోపాటు మైన్స్ అధికారులు చేజర్ల మండల పరిధిలో మాముడూరు, కోటితీర్ధం, నెల్లూరు రూరల్లో ములుముడి ప్రాంతాల్లో కొత్తగా రీచ్‌లు ఓపెన్ చేసేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. లేగుంటపాడులోనూ రీచ్ కోసం అధికారులు పరిశీంచారు.

News January 11, 2026

నెల్లూరు: త్వరలో మూడు చోట్ల ఇసుక రీచ్‌లు.?

image

పెన్నా పరీవాహక ప్రాంతంలో మరో 3 చోట్ల కొత్త ఇసుక రీచ్‌లు రానున్నాయట. ఇప్పటికే పొట్టేపాలెం, సంగం, సూరాయాపాలెం వద్ద పాయింట్లు ఉండగా విరువూరు వద్ద ఓపెన్ రీచ్ ఉంది. వీటితోపాటు మైన్స్ అధికారులు చేజర్ల మండల పరిధిలో మాముడూరు, కోటితీర్ధం, నెల్లూరు రూరల్లో ములుముడి ప్రాంతాల్లో కొత్తగా రీచ్‌లు ఓపెన్ చేసేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. లేగుంటపాడులోనూ రీచ్ కోసం అధికారులు పరిశీంచారు.