News May 10, 2024
కొండాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొండాపురం మండలం పి.అనంతపురం దగ్గరలో చిత్రావతి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరుకు చెందిన సి.శివకుమార్(18) శుక్రవారం మధ్యాహ్నం బైక్పై తన గ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొండాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 19, 2025
గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.
News February 19, 2025
గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.
News February 19, 2025
కడప: ‘ప్రాజెక్టులను విస్మరిస్తే ఉద్యమమే’

నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో రాయలసీమను విస్మరిస్తే ఉద్యమం తప్పదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కెఆర్ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య అన్నారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు కడపలో జరుగు ప్రాజెక్టుల ప్రాంతీయ సదస్సు ఉద్యమ కార్యాచరణకు వేదిక కానుందని తెలిపారు. కడపలో జరుగు ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.