News December 4, 2024

కొండాపురం; 30 మంది సచివాలయం సిబ్బందికి మెమోలు

image

కొండాపురం మండలంలో పనిచేసే 30 మంది సచివాలయం సిబ్బందికి ఎంపీడీవో ఆదినారాయణ బుధవారం మెమోలు ఇచ్చారు. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కలకలం రేగింది. సచివాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఎంపీడివో పలు విషయాలను గుర్తించినట్లు తెలిపారు. మెమోలిచ్చిన వారంతా సచివాలయాల విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరు ఇదేవిధంగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు తెలిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Similar News

News November 23, 2025

పెన్నానది ఐలాండ్లో 12 మంది అరెస్ట్

image

ఇందుకూరుపేట(M) కుడితిపాలెం సమీపంలోని పెన్నా నది ఐలాండ్‌లో పేకాటాడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. SP అజిత పర్యవేక్షణలో రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు చేపట్టారు. డ్రోన్ కెమెరా ద్వారా పేకాట రాయుళ్ల కదలికలను పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3లక్షల నగదు, 3కార్లు, 6 బైక్‌లు, 14 ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.

News November 23, 2025

నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News November 23, 2025

నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.