News April 14, 2025
కొండాపూర్:ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తిరిగి పాఠశాలల జూన్ 12న పున ప్రారంభమవుతాయని చెప్పారు. అన్ని పాఠశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. nవేసవి సెలవులో తరగతులు నిర్వహించవద్దని పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. KCR పిలుపు

జూబ్లీహిల్స్ బైపోల్పై మాజీ CM KCR మొదటి సారి మాట్లాడారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలకు BRS నేతలు, కార్యకర్తలు వివరించి, అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ను నిలబెట్టి HYD ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందన్నారు. రౌడీషీటర్ను ఓడించి, HYDలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ దోపిడీ పాలనతో తెలంగాణను గుల్లా చేసిందన్నారు.
News October 23, 2025
నిర్మాణ పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం తన ఛాంబర్లో హౌసింగ్, మెప్మా, మున్సిపల్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. గడువులోగా హౌస్ సైట్ మార్కౌట్ పనులు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి, ఇళ్లు త్వరితగతిన నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 23, 2025
భీమడోలులో మహిళా దొంగ అరెస్ట్

బస్టాండుల్లో ప్రయాణికుల బ్యాగులను దొంగిలిస్తున్న మహిళను గురువారం భీమడోలు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన వేములపల్లి దుర్గ ప్రయాణికులను టార్గెట్ చేసి వారి బ్యాగులను దొంగిలిస్తుంది. నేడు నమోదైన ఓ కేసులో ఆమె నుంచి 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.


