News April 5, 2025
కొండాపూర్: నమోదు పెంచే బాధ్యత HMలదే: డీఈవో

ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు పెంచే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. మల్కాపూర్లో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల శిక్షణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో సాంకేతికను ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రాథమిక విద్యార్థులకు ఆటపాటలతో బోధన చేసేలా చూడాలని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
సిరిసిల్లలో సర్పంచుల ‘ఏకగ్రీవాల పర్వం’..!

సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. రుద్రంగి మండలంలోని రూప్లానాయక్ తండా సర్పంచ్గా జవహర్లాల్ నాయక్ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా ఇవాళ ఉదయం అదే మండలంలోని ‘సర్పంచ్ తండా’కు సర్పంచ్(నరహరి నాయక్), ఉప సర్పంచ్(గంగారాం నాయక్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, ఈ రెండు తండాల్లో తొలి విడత అయిన DEC 11న ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏకగ్రీవం కావడంతో ఇక ఇక్కడ ఎన్నికలు లేనట్లే.
News November 27, 2025
MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.
News November 27, 2025
ఢిల్లీలో మరింత పడిపోయిన గాలి నాణ్యత!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. నేడు ఉదయం గాలి నాణ్యత AQI 351గా రికార్డైంది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలతోపాటు బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి ఏరియాల్లో AQI 300 కంటే ఎక్కువ ఉంది. బుధవారం సాయంత్రం 327 వద్ద ఉన్న గాలి నాణ్యత ఈరోజు ఉదయానికి మరింత దిగజారింది. వరుసగా 21వ రోజు కూడా AQI 300 కంటే ఎక్కువ నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.


