News October 12, 2024
కొండారెడ్డిపల్లికి చేరుకనన్న సీఎం రేవంత్ రెడ్డి
వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దసరా సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన సీఎంకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. గ్రామస్థులు బోనాలు, బతుమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. సీఎం రాకతో కొండారెడ్డిపల్లికో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
Similar News
News October 12, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యాంశాలు
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.
✓ అలంపూర్: కన్నుల పండుగగా తెప్పోత్సవం.
✓ అలంపూర్: జోగులాంబను దర్శించుకున్న డీజీపీ జితేందర్.
✓ కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.
✓ కల్వకుర్తి: ఉప్పొంగిన దుందుభి వాగు రాకపోకలు బంద్.
✓ రేపు కోడంగల్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు.
News October 12, 2024
MBNR: కుంటలో పడి అన్నదమ్ములు మృతి
దసరా వేళ మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నీట మునిగి అన్నదమ్ములు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మూసాపేట మండలం స్ఫూర్తి తండాకు చెందిన సక్రు నాయక్ పిల్లలు సాయి(12), సాకేత్(10). సాయి చక్రాపూర్ గ్రామంలో, సాకేత్ MBNRలో చదువుతుండగా దసరా సెలవులకు ఊరికొచ్చారు. ఇవాళ సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందారు. స్థానికులు గమనించి కుంట నుంచి మృతదేహాలను బయటకు తీశారు.
News October 12, 2024
దసరా వేడుకలు.. పంచ కట్టులో రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన గ్రామస్థులు, అభిమానులతో కలిసి జమ్మి చెట్టు వద్దకు కాలినడకగా వెళ్లారు. ఎంపీ మల్లు రవి, MLAలు, తన మనవడు, కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు.