News April 5, 2025
కొటికలపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

అద్దంకి మండలంలోని కొటికలపూడి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశువులు మేపుకోవడం కోసం వెళ్లిన కోటేశ్వరమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 10, 2025
పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం

AP: దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.
News December 10, 2025
పురుగు మందులు.. రైతులకు సూచనలు

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్ల నాజిల్స్లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.
News December 10, 2025
అలా చేస్తే కేసులు నమోదు చేస్తాం: తిరుపతి SP

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇప్పిస్తామని జీప్ డ్రైవర్లు, దళారులు భక్తులను మోసగిస్తే కేసులు నమోదు చేస్తామని తిరుపతి SP సుబ్బరాయుడు హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లపై TTD అధికారులతో ఆయన సమీక్ష చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, అలిపిరి, లగేజ్ కౌంటర్ వంటి ముఖ్య ప్రదేశాల్లో భక్తులకు నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు. రెగ్యులర్గా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ఉంటాయన్నారు.


