News April 5, 2025
కొటికలపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

అద్దంకి మండలంలోని కొటికలపూడి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశువులు మేపుకోవడం కోసం వెళ్లిన కోటేశ్వరమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 3, 2025
VHTలో ఆడనున్న విరాట్ కోహ్లీ!

దేశవాళీ ODI టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (VHT)లో ఆడేందుకు విరాట్ కోహ్లీ అంగీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ధ్రువీకరించారని తెలిపింది. DEC 24 నుంచి జరగనున్న ఈ టోర్నీలో కోహ్లీ 3 మ్యాచుల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించే ఛాన్సుంది. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆయన ఈ టోర్నీలో ఆడనున్నారు. అటు రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడే అవకాశముంది.
News December 3, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించిన సీఎం
✓సమస్యలపై సీఎంకు విజ్ఞప్తి చేసిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
✓గుండెపోటుతో ఇల్లందులో సింగరేణి కార్మికుడి మృతి
✓పాల్వంచ: నాగారం స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం
✓కొత్తగూడెంలో సీఎం పర్యటన.. ప్రతిపక్ష నాయకుల అరెస్ట్
✓సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు: అశ్వారావుపేట ఎస్సై
News December 3, 2025
బాబయ్య స్వామికి చాదర్ సమర్పించిన మంత్రి, కలెక్టర్

పెనుకొండలో బాబయ్య ఉరుసు మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. బాబాఫక్రుద్దీన్ గంధం మహోత్సవం సందర్భంగా మంత్రి, కలెక్టర్ బాబయ్య స్వామికి ప్రభుత్వం తరుఫున చాదర్ సమర్పించారు. మంత్రికి బాబయ్యస్వామి దర్గా వంశ పారంపర్య ముతవల్లి తాజ్ బాబా పూలమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు చేశారు.


