News July 11, 2024

కొడంగల్: అమ్మ సూసైడ్.. యాక్సిడెంట్‌లో నాన్న మృతి

image

ఆరు నెలల కింద అమ్మ సూసైడ్ చేసుకోగా నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో నాన్న మృతిచెందాడు. దీంతో వారి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. సర్జఖాన్ పేటకు చెందిన కుమ్మరి శ్రీనివాస్(36) చంద్రకల్ క్రిస్టియన్ హాస్టల్‌లో చదువుకుంటున్న కూతురుని చూసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా బైకు అదుపుతప్పి కిందపడ్డాడు. చికిత్స పొందుతూ బుధవారం గాంధీ ఆసుపత్రిలో మృతిచెందినట్లు ఏఎస్ఐ బాలకిషన్ తెలిపారు.

Similar News

News December 10, 2025

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

image

నిష్పక్షపాతంగా ప్రతి అధికారి విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి బుధవారం సూచించారు. రేపు మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని, ఎల్లప్పుడూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ ఉండాలని సూచించారు.

News December 10, 2025

మహబూబ్‌నగర్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. గండీడ్ మండలం సల్కర్‌పేటలో అత్యల్పంగా 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిడ్జిల్ మండలం దోనూరులో 9.3, మిడ్జిల్‌లో 10.1, కోయిలకొండ సిరి వెంకటాపురం, భూత్‌పూర్‌లో 10.5, దేవరకద్రలో 10.9, కొత్త మొల్గ‌రలో 11.4, జానంపేటలో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 10, 2025

MBNR: మూడో విడతలో 440 మంది సర్పంచ్ అభ్యర్థులు.!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోరు రసవత్తరంగా మారింది. ఈ విడతలో మొత్తం 440 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అడ్డాకల్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జడ్చర్ల మండలానికి సంబంధించి ఒక గ్రామ పంచాయతీలో నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.