News July 11, 2024
కొడంగల్: అమ్మ సూసైడ్.. యాక్సిడెంట్లో నాన్న మృతి

ఆరు నెలల కింద అమ్మ సూసైడ్ చేసుకోగా నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో నాన్న మృతిచెందాడు. దీంతో వారి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. సర్జఖాన్ పేటకు చెందిన కుమ్మరి శ్రీనివాస్(36) చంద్రకల్ క్రిస్టియన్ హాస్టల్లో చదువుకుంటున్న కూతురుని చూసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా బైకు అదుపుతప్పి కిందపడ్డాడు. చికిత్స పొందుతూ బుధవారం గాంధీ ఆసుపత్రిలో మృతిచెందినట్లు ఏఎస్ఐ బాలకిషన్ తెలిపారు.
Similar News
News November 28, 2025
MBNR: కొనసాగుతున్న చలి తీవ్రత

మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. జిల్లాలో అత్యల్పంగా మిడ్జిల్ మండలం దోనూరులో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 14.1, రాజాపూర్ 14.4, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ 14.9, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.0, హన్వాడ 15.1, మిడ్జిల్ 15.2, మూసాపేట 15.5, మహమ్మదాబాద్ 15.7, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 27, 2025
MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
News November 27, 2025
బాలానగర్లో 13.5°C.. పెరిగిన చలి తీవ్రత

మహబూబ్నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యల్పంగా బాలానగర్లో 13.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 13.8°C, దోనూరులో 13.9°C నమోదయ్యింది. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.


