News December 12, 2024

కొడంగల్: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్

image

కొడంగల్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న విధానాన్ని పర్యవేక్షించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ ఉన్నారు.

Similar News

News January 24, 2025

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌ కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్‌లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149‌గా నిర్ణయించారు. మీ ఏరియాలో‌ ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT

News January 23, 2025

డిజిటల్ భద్రత కోసం రాచకొండ పోలీసుల సూచనలు

image

డిజిటల్ గుర్తింపును రక్షించుకోవడం అత్యంత ప్రాముఖ్యమని రాచకొండ పోలీసులు సూచించారు. బయోమెట్రిక్ OR 2FA వంటి 2తరగతుల భద్రతను ఉపయోగించి అకౌంట్లను రక్షించుకోవాలన్నారు. ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌లు సృష్టించాలని తెలిపారు. మీ డిజిటల్ హెల్త్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. గూగుల్‌లో మీ వివరాలను చెక్ చేసి, ఉపయోగించని అకౌంట్లను తొలగించాలని(OR)1930లో సంప్రదించాలన్నారు.

News January 23, 2025

HYD ఎయిర్‌పోర్ట్‌లో సందర్శకులకు నో ఎంట్రీ

image

గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT