News March 26, 2025

కొడంగల్: తిరుపతిరెడ్డిపై పోస్ట్.. యువతిపై కేసు నమోదు

image

సీఎం రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతిరెడ్డి ఈనెల 22న కోస్గి మండలం బిజ్జూరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు SIబాల్‌రాజ్ తెలిపారు. తిరుపతిరెడ్డి భూకబ్జాలు చేసేందుకు వచ్చాడని హన్మాన్‌పల్లి వాసి పద్మ వాట్సాప్ గ్రూపుల్లో ఆధారాలు లేకుండా తప్పుడు మెసేజ్ చేసిందని NSUIఅధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 25, 2025

సిరిసిల్ల: 3,740 మంది మందుబాబులపై కేసులు: SP

image

గడిచిన సంవత్సరంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 3,740 మందిపై కేసులు నమోదు చేశామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా ఉంచామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 25, 2025

మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

image

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్‌లో ప్రశ్నించారు.

News November 25, 2025

ASF: ‘రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం’

image

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని BJP జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, MAL డా.హరీష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ వెంకటేష్ ధోత్రేకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 335 సర్పంచ్ స్థానాల్లో కేవలం 20 మాత్రమే బీసీలకు కేటాయించడాన్ని ఖండించారు. బెజ్జూర్‌లో ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. చట్టప్రకారం 23% రిజర్వేషన్ ఇవ్వలేదని, వెంటనే సవరణ చేయాలని డిమాండ్ చేశారు.