News March 26, 2025

కొడంగల్: తిరుపతిరెడ్డిపై పోస్ట్.. యువతిపై కేసు నమోదు

image

సీఎం రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతిరెడ్డి ఈనెల 22న కోస్గి మండలం బిజ్జూరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు SIబాల్‌రాజ్ తెలిపారు. తిరుపతిరెడ్డి భూకబ్జాలు చేసేందుకు వచ్చాడని హన్మాన్‌పల్లి వాసి పద్మ వాట్సాప్ గ్రూపుల్లో ఆధారాలు లేకుండా తప్పుడు మెసేజ్ చేసిందని NSUIఅధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 9, 2025

జనగామ: ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష

image

తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై నేడు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎంపీడీవోలతో గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి మండలంలో ఓటింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ వంటి అంశాలను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.

News December 9, 2025

తిరుపతి SVU ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc(మాస్టర్ లైబ్రరీ సైన్స్ ) 1, 2 సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం(SVU DDE) ఆధ్వర్యంలో డిగ్రీ B.A/B.Com/B.Sc చివరి సంవత్సరం పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. www.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News December 9, 2025

ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది: కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37 వేల మంది రైతులు నుంచి కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగా రూ.483.27 కోట్లు, 48 గంటల లోపుగా రూ.18.84 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా 90 వేల గన్నీ బ్యాగులను రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు.