News March 28, 2024
కొడంగల్ నుంచి 50 వేల మెజార్టీ రావాలి: సీఎం
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి నిర్వహించే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పని చేయాలని, ఏప్రిల్ 8న కొడంగల్ మళ్లీ వచ్చి సమన్వయ కమిటీ సభ్యులతో ఎంత మెజార్టీ ఇస్తారో రాయించుకుని సంతకాలు తీసుకుంటానన్నారు. ఇవే సమన్వయ కమిటీలు తర్వాత నిర్వహించే ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయన్నారు.
Similar News
News January 18, 2025
MBNR: ఇంటర్ బోర్డు నిఘాలో ప్రయోగ పరీక్షలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే నెల 3 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల పర్యవేక్షణకు హైదరాబాదులోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో కమాండ్, కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తామని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 22 వరకు కొనసాగుతాయని అధికారులు వివరించారు.
News January 18, 2025
MBNR: ఇబ్బందులకు గురి చేసే అధికారులను ఉపేక్షించం: మంత్రి జూపల్లి
ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఉపేక్షించబోమని మంత్రి జూపల్లికృష్ణారావు హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి పెంట్లవెల్లికి వచ్చిన మంత్రికి రెవెన్యూ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు, నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో సంబంధిత అధికారులు స్పందించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశించారు.
News January 18, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔క్రికెట్:ఫ్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరిన PU జట్టు
✔బిజినేపల్లి:కల్లు సీసాలో పాము కలకలం
✔పంచాయతీ పోరు..బ్యాలెట్ పత్రాలు సిద్ధం
✔ఉమ్మడి జిల్లాల్లో పెరుగుతున్న చలి
✔వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష.. పాల్గొన్న MLAలు,వైద్యాధికారులు
✔గద్వాల:గొర్రెలను ఢీకొట్టిన లారీ..2 గొర్రెలు మృతి
✔బడి బయటి విద్యార్థులకు గుర్తింపు సర్వే
✔బొంరాస్ పేట:రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
✔రేపు జవహర్ నవోదయ పరీక్ష
✔ఢిల్లీ పీఠం మాదే:DK అరుణ