News March 29, 2025

కొడంగల్ ప్రజలు రాష్ట్రన్ని పాలించే శక్తిని ఇచ్చారు: సీఎం

image

కొడంగల్ ప్రజలు రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చు.. వాళ్లను పట్టించుకోవద్దన్నారు. వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదటగా లేవనెత్తింది తానే అన్నారు. ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 25, 2025

ఇతిహాసాలు క్విజ్ – 46 సమాధానాలు

image

1. రామాయణంలో జటాయువు సోదరుడి పేరు ‘సంపాతి’.
2. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికిన పర్వతం ‘మందరం’.
3. నాగుల చవితి కార్తీక మాసంలో వస్తుంది.
4. ఇంద్రుడి గురువు ‘బృహస్పతి’.
5. అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కును పాలించేది ‘కుబేరుడు’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 25, 2025

పఠన సామర్థ్యం కోసం ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన సామర్థ్యం పెంచే లక్ష్యంతో అక్టోబర్ 27 నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు దీనిని అమలు చేయాలని ఆదేశించారు. ఆంగ్ల భాష ఫొనెటిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు సులభంగా చదవడం నేర్పాలన్నారు.

News October 25, 2025

ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి: CBN

image

AP: మొంథా తుఫాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని CM CBN ఆదేశించారు. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ‘జిల్లాలకు ఇన్ఛార్జిల్ని వేయాలి. అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి. కాకినాడలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ సేవల్ని అందించాలి. 100 KM వేగంతో గాలులు, 100MM మేర వర్షాలు పడతాయి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.