News March 19, 2025
కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.
Similar News
News March 20, 2025
PDPL: ముగిసిన ఇంటర్ పరీక్షలు: జిల్లా అధికారి కల్పన

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. నేటి పరీక్షకు 4532 మంది హాజరు కావాల్సి ఉండగా, 4428 మంది హాజరు కాగా, 104 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అన్నారు. ఇవాళ 97.7% హాజరు నమోదయిందన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
News March 20, 2025
IPL: KKRvsLSG మ్యాచ్ రీషెడ్యూల్

ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్లో జరగాల్సిన KKRvsLSG మ్యాచ్ను గువాహటికి బీసీసీఐ మార్చింది. ఆ రోజున శ్రీరామనవమి సందర్భంగా కోల్కతాలో భారీగా ఊరేగింపులు జరగనున్నాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ను రీ షెడ్యూల్ చేశారు. గత ఏడాది KKRvsRR మ్యాచునూ ఇదే కారణంతో వాయిదా వేశారు.
News March 20, 2025
భద్రకాళి చెరువు పూడికతీత పనులు పూర్తి కావాలి: మంత్రి

వానకాలం సీజన్ రాకముందు భద్రకాళి చెరువు పూడిక తీత పనులు పూర్తి కావాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులను మేయర్, ఎమ్మెల్యే, కుడా ఛైర్మన్, కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. ప్రతిరోజు చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయని, సోమవారం నుండి విద్యుత్ లైట్లను తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో కూడా మట్టి తరలింపు చేస్తామని కలెక్టర్ ప్రావీణ్య మంత్రికి వివరించారు.