News March 19, 2025
కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.
Similar News
News October 24, 2025
కామారెడ్డి: ఈనెల 31 నుంచి పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ(అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ) రెగ్యులర్ 7, 9 సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు జరగనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల షెడ్యూల్ విడుదల చేసామని, పూర్తి వివరాలకు వెబ్సైట్ సందర్శించాలని ఆయన తెలిపారు.
News October 24, 2025
ప్రకాశం జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవులు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు (శుక్రవారం) అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇస్తూ జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో సెలవులు ఇచ్చామని, ఈ నిర్ణయాన్ని ప్రతి పాఠశాల యాజమాన్యం పాటించాలన్నారు.
News October 24, 2025
తిరుపతి: సుదర్శన చక్రత్తాళ్వారు తీర్థం గురించి తెలుసా..

శేషాచల పర్వతలల్లోని అనేక పుణ్యతీర్థాల నుంచి జాలువారి పవిత్ర కపిలతీర్థం సరోవరం (కోనేరు) ఏర్పడింది. దీనినే సుదర్శన చక్రత్తాళ్వారు తీర్థం, ఆళ్వారు తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ పుణ్యతీర్థంలో స్నానాలు చేసి తూర్పు వైపు ఉన్న శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలిగుతాయని ప్రసిద్ధి.


