News February 12, 2025
కొడంగల్: బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్

దుద్యాల మండలంలోని పోలేపల్లి శ్రీరేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 21న ప్రధాన ఘట్టం సిడె కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారని ఆలయ మేనేజర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ జయరాములు, నాయకులు మెరుగు వెంకటయ్య, సీసీ వెంకటయ్యగౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
WPL మెగావేలం-2026: అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే

1.దీప్తీ శర్మ(UP వారియర్స్): రూ.3.2కోట్లు, 2.అమీలియా కెర్(MI): రూ.3కోట్లు
3.శిఖా పాండే(UPW): రూ.2.4కోట్లు, 4.సోఫీ డివైన్(గుజరాత్ జెయింట్స్): రూ.2కోట్లు, 5.మెగ్ లానింగ్(UPW): రూ.1.9కోట్లు, 6.చినెల్లి హెన్రీ(DC): రూ.1.30కోట్లు, 7.శ్రీచరణి(DC): రూ.1.30కోట్లు,8. లిచ్ ఫీల్డ్(UPW): రూ.1.20కోట్లు
9. లారా వోల్వార్ట్(DC): రూ.1.10కోట్లు,10. ఆశా శోభన(UPW): రూ.1.10కోట్లు
News November 28, 2025
జిల్లాలో ధాన్యం సేకరణకు 3,715 వాహనాలు: కలెక్టర్

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లాలో ధాన్యం సేకరణకు 3,715 వాహనాలను నడుపుతున్నామని కలెక్టర్ డీకే బాలాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ధాన్యం సేకరణ, గంజాయిపై అవగాహన, తదితర అంశాలపై సమీక్షించారు.
News November 28, 2025
పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే అనుమతులు: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామన్నారు.


