News October 4, 2024

కొడంగల్: యువకుడికి 4 ప్రభుత్వ ఉద్యోగాలు

image

కొడంగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ డీఎస్సీ ఫలితాల్లో రాష్ట్రంలో సోషల్ స్టడీస్‌లో 2వ ర్యాంక్, VKB జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అదే విధంగా ఇటీవలే గురుకుల ఫలితాలలో టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగంతో సత్తా చాటాడు. 4 ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువకులకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News October 4, 2024

రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ

image

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో రేపు గద్దర్ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు పలువురు బహుజన మేధావులు హాజరు అవుతారన్నారు. ఏపూరి సోమన్న బృందంతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

News October 4, 2024

సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే

image

గద్వాల మండలంలోని సంగాల చెరువులో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

News October 4, 2024

NGKL: వరి పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

image

వానా కాలంలో రైతులు సాగుచేసిన వరి పంట కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నాగర్ కర్నూల్‌లో 244, నారాయణపేటలో 95 జోగులాంబ గద్వాలలో 55, వనపర్తిలో 244, మహబూబ్‌నగర్లో 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.