News February 25, 2025

కొడంగల్: రైతుల భాగస్వామ్యం అభినందనీయం: కలెక్టర్

image

కొడంగల్ ప్రాంత అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం అభినందనీయమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు సమ్మతించిన దుద్యాల మండలం లగచర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 102లోని 22మంది రైతులకు రూ.6.38 కోట్ల చెక్కులను ఆయన ఆదివారం అందజేశారు. సబ్-కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్, లైబ్రరీ ఛైర్మన్ రాజేష్ రెడ్డి ఉన్నారు.

Similar News

News November 17, 2025

మదనాపూర్: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ దేశస్థులు

image

దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని సోమవారం ఉదయం జపాన్ దేశస్థులు దర్శించుకున్నారు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.

News November 17, 2025

నెల్లూరు జిల్లాలో 10th విద్యార్థులకు అపార్ గండం

image

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం 10th విద్యార్థులకు గండంగా మారింది. NEP ప్రకారం విద్యార్థులందరికీ అపార్ గుర్తింపు కార్డు, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN) ఉండాలి. స్కూల్ రికార్డ్‌లోని వివరాలు, విద్యార్థి ఆధార్ వివరాలు అక్షరం తప్పు లేకుండా సరిపోయిన విద్యార్థులకు APAAR. ID, PEN లభిస్తాయి. అవి ఉంటేనే 10th పరీక్ష ఫీజు చెల్లింపు అవుతుంది. వేల మంది విద్యార్థులకు ఈ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉంది.

News November 17, 2025

అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలమైన బాల్యం: సీతక్క

image

బాల్యంలోనే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తు బలంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పుష్ఠికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, నాసిరకం పాలను సరఫరాచేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చంటి పిల్లలు దేవుళ్లతో సమాని, వారిని సంరక్షిస్తామన్నారు.